నవతెలంగాణ-హైదరాబాద్ : తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలెర్ట్. తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. నిన్న 22 కంపార్టుమెంట్లలో తిరుమల శ్రీవారి భక్తులు వేచివున్నారు. నిన్న టోకెన్ లేని తిరుమల శ్రీవారి భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. 65,937 మంది భక్తులు నిన్న తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.ఇక నిన్న ఒక్కరోజే 24,101 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక నిన్న ఒక్కరోజే తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.28 కోట్లు గా నమోదు అయింది.