నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ లో జరగనున్న ఎన్నికల సమయాల్లో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఏకంగా డీసీపీ ఫోన్ నే 2 గంటల పాటు హ్యాక్ చేశారు. డీసీపీ ఫోన్ హ్యాక్ చేసిన విషయం చర్చినీయాంశముగా మారింది. ఫోన్ హ్యాక్ ఐన సమయంలో ఫోన్ నుండి కొన్ని శబ్దాలు, నోటిఫికెషన్స్ వచ్చాయని డీసీపీ తెలిపారు. ఫోన్ ను సాధారణ స్థితికి తీసుకురావడానికి సైబర్ బాబులు చాలా కష్టపడ్డారని డీసీపీ వెల్లడించారు.