![](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/11/IMG-20231116-WA0043-300x135.jpg)
– గడపగడపకు ప్రచారం
– తల్లి సోనియమ్మ రుణం తీర్చుకుందాం
నవతెలంగాణ-పెన్ పహాడ్ : సూర్యాపేటలో గెలిచేది దామన్నే అని మండల పరిధిలోని అనంతారం గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు గజ్జల సైదిరెడ్డి అన్నారు. కాంగ్రెస్ గడపగడపకు ప్రచారంలో భాగంగా గురువారం గ్రామంలో పార్టీ నాయకులతో కలిసి కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల మేనిఫెస్టోను వివరించారు. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ రుణం తీర్చుకునే సమయం వచ్చిందని, బిఆర్ఎస్ నాయకుల ఆగడాలు ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకి వేసి దామన్నను అసెంబ్లీకి పంపాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుబంధుతో పాటుగా వరికి రూ. 500ల బోనస్ కూడా వస్తుందని, బిఆర్ఎస్ నాయకుల మాటలు నమ్మేలా లేవని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్, వార్డుసభ్యులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, యూత్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.