నవతెలంగాణ – హైదరాబాద్ : జూనియర్ ఎన్ఠీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ దేవర. సుమారు 300 కోట్ల వరకు ఈ సినిమాపై ఖర్చు చేస్తున్నారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. సైఫ్ అలీఖాన్ పవర్ ఫుల్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. నవంబర్ ఆఖరుకి దేవర సినిమా షూటింగ్ కంప్లీట్ చేయాలనే ఆలోచనతో కొరటాల శివ ఉన్నారు. దానికి తగ్గట్లుగానే గ్యాప్ లేకుండా షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుంటున్నాడు. హై వోల్టేజ్ట్ యాక్షన్ ప్యాక్డ్ మూవీగా చిత్రాన్ని సిల్వర్ స్క్రీన్ పై కొరటాల శివ ఆవిష్కరించే పనిలో ఉన్నారు. హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ సైతం ఈ సినిమాకి వర్క్ చేయడం విశేషం. ఇదిలా ఉంటే ఏప్రిల్ 5న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఐదు ఇండియన్ భాషలలో రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే డేట్ కన్ఫర్మ్ చేసేశారు. దేవర మూవీ ఓటీటీ డీల్ క్లోజ్ అయిపొయింది. ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ కంపెనీ నెట్ ఫ్లిక్స్ దేవర మూవీ డిజిటల్ రైట్స్ ని అన్ని భాషలకి సంబంధించి సొంతం చేసుకుంది. ఏకంగా 150 కోట్లకి ఈ హక్కులు దక్కించుకున్నట్లు తెలుస్తోంది.