– సంక్షేమ పథకాలే విజయానికి నాంది
– ఎన్నికల ప్రచారంలో వనమా
నవతెలంగాణ-కొత్తగూడెం
కంటి ముందు అభ్యర్ధి…ఇంటి ముందు అభివృద్ధే బీఆర్ఎస్ లక్ష్యమని, సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ పార్టీ విజయానికి నాంది పలుకుతాయని, బీఆర్ఎస్ విజయాన్ని ఏ శక్తి ఆపలేదని, అందరి చూపు బీఆర్ఎస్ వైపే ఉందని ఎన్నికల ప్రచారంలో వనమా వెంకటేశ్వరరావు అన్నారు. గురువారం ఆయన ప్రచారంలో భాగంగా లక్ష్మీదేవిపల్లి మండలంలో పెద్దఎత్తున ప్రచారం నిర్వహించారు. ఈ నెల 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో వనమా వెంకటేశ్వరరావు దూసుకు పోతున్నారు. నియోజకవర్గంలోని గ్రామాలను చుట్టేస్తూ తన గెలుపు కోసం విస్తృత ప్రచారం చేస్తూ ఓటర్లను కలుస్తూ ఓటును అభ్యర్థిస్తున్నారు. లక్ష్మీదేపల్లి మండల పరిధిలోని ఏజెన్సీ ప్రాంతాలైన రేగళ్ల, బంగారు చేలక, పునుకుడు చిలక, మైలారం తదితర ప్రాంతాల్లో ప్రచారాన్ని నిర్వహించారు. మహిళలు, ప్రజలు, బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు వనమా వెంకటేశ్వరరావుపై పూలు చల్లుతూ డప్పు వాయిద్యాలు, గిరిజన నృత్యాల మధ్య ఘన స్వాగతం పలికారు. ప్రతి గ్రామంలోనూ వనమాకు నీరాజనం పలికారు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో జరిగిన ప్రచార సభల్లో వనమా, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఎడవల్లి కృష్ణలు మాట్లాడారు. అందరి చూపు బీఆర్ఎస్ వైపే ఉందని, కంటి ముందు అభ్యర్థి….ఇంటి ముందు అభివృద్ధి బీఆర్ఎస్ లక్ష్యమన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే ఏజెన్సీ ప్రాంతాలతో పాటు తండాల అభివృద్ధి జరిగింద న్నారు. ఏజెన్సీ ప్రాంతాలైన బంగారుచెలక, ఉల్వనూరులకు రోడ్డు వేయించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని చెప్పారు. తనను మళ్లీ గెలిపిస్తే సేవకుడిలా పని చేస్తానని అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతానన్నారు. గిరిజన ప్రాంతాలలో పోడు భూములు సాగు చేసుకునే రైతులకు 5000 పట్టాలు అందజేశానని, దళిత బంధు, రైతుబంధు, బీసీ, మైనార్టీ బందులతోపాటు, షాదీ ముబారక్ కళ్యాణ్లక్ష్మి వంటి అనేక పథకాలను ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి మూడోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు.ఈ ప్రచార కార్యక్రమాల్లో బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
వనమా కుటుంబ సభ్యుల ప్రచారం
వనమా వెంకటేశ్వరరావు గెలుపు కోరుతూ ఆయన మనుమరాళ్లు డాక్టర్.వనమా అలేఖ్య, హర్షిని మనీషాలు పెద్తఎత్తున ప్రచారంలో పాల్గొంటున్నారు. తాతా గెలుపుకు ఓటర్లును కలిసి వనమాకు ఓటు వేయాలని కోరుతున్నారు. గురువారం ఉదయం 6 గంటలకు కొత్తగూడెం హౌల్ సేట్ కూరగాయల మార్కెట్లో వ్యాపారస్తులను కలిసి, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వనమాఙష్ట్రని గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ అధ్యక్షులు బత్తుల మధుచంద్, మాట్లా గాయత్రి, ఖాజా మొయినుద్దీన్, జవహర్, సంగెం శివ, బర్ల అన్వేష్, కంచర్ల రామారావు తదితరులు పాల్గొన్నారు.