– రాష్ట్రంలో కేసీఆర్.. మంథనిలో పుట్టను గెలిపించాలి
– మంథని మున్సిపల్ చైర్మన్ శైలజా
నవతెలంగాణ- మల్హర్ రావు: అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి బీఆర్ఎస్ తోనే సాధ్యమని మంథని మున్సిపల్ చైర్మన్ పుట్ట శైలజా అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలో కేసీఆర్, మంథనిలో పుట్ట మదుకర్ కారు గుర్తుకు ఓటువేసి గెలిపించాలని కోరారు. శుక్రవారం మంథనిలోని ముత్యాలమ్మ వాడలో ఇంటింటా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన మేనిపేస్టో లో ఉన్న పథకాలు అన్నీ వర్గాల ప్రజల సంక్షేమమే ద్యేయంగా టీసుకొచ్చినట్లుగా తెలిపారు. మంథని నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని పుట్ట విజయం తథ్యమన్నారు. ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలే కాకుండా పుట్ట లింగమ్మ ట్రస్ట్ ద్వారా విద్యార్థుల ఆకలి తీర్చడానికి కళాశాలల్లో మధ్యాహ్న భోజనాలు, నిరుపేద అడబిడ్డల పెళ్లిళ్లు,రోగులకు అంబులెన్స్ లు, కరోనా విపత్కర పరిస్థితుల్లో నిరుపేద కుటుంబాలకు ఆర్థికంగా చేయూతనిచ్చినట్లుగా వివరించారు.