– వికలాంగుల బంధు పథకం ప్రవేశపెట్టాలి
– అక్టోబర్ 9న ఛలో హైదరాబాద్
– ఎన్పీఆర్డీ రాష్ట్ర కార్యదర్శి ఏం.అడివయ్య
నవతెలంగాణ-జహీరాబాద్
వికలాంగులకు నెలకు రూ.10వేల పెన్షన్ ఇవ్వాలని ఎన్పీఆర్డీ రాష్ట్ర కార్యదర్శి ఎం.అడివయ్య డిమాండ్ చేశారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జహీరాబాద్ నియోజకవర్గం సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. అనంతరం ఛలో హైదరా బాద్ కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అడివయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో 21 రకాల వైకల్యాల ప్రకారం సుమారు 43.04 లక్షల మంది వికలాంగులు ఉన్నారన్నారు. వారిలో 5.16లక్షల మందికే పెన్షన్లు వస్తు న్నాయన్నారు. వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం 2016లో పేర్కొన్న అంశాలను అమలు చేయాలన్నారు. 2016ఆర్పీడీ చట్టం సెక్షన్ 79 ప్రకారం వికలాంగుల కమిషన్ ఏర్పాటు చేసి, చైర్మెన్, సభ్యులను నియమించాలన్నారు. ధరల పెరుగుదలకు అనుగు ణంగా ప్రస్తుతం ఇస్తున్న రూ.4016 పెన్షన్ను రూ.10వేలకు పెంచాలన్నారు. ఆసరా పెన్షన్లకు ఆదాయపరిమితి విధించే జీవో నెంబర్ 17 రద్దు చేయాలన్నారు. నామినేటెడ్ పద వుల్లో వికలాంగులకు రిజర్వేషన్స్ కల్పిస్తూ అసెంబ్లీలో ప్రత్యేక చట్టం చేయాలన్నారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్స్ అమలు చేయాలన్నారు. ప్రతీ వికలాంగుల కుటుంబానికి 250 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వాలన్నారు. వైకల్య ధ్రువీ కరణ పత్రం కలిగిన వికలాంగులకు ఆర్టీసీ మరియు రైల్వేలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలన్నారు. 40 శాతం వైకల్యం కలిగిన వారందరికీ బస్పాసులు ఇవ్వాలన్నారు. ఉద్యోగ నియామకల్లో శారీరక వికలాంగుల రోస్టర్ 10లోపు తగ్గించాలన్నారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న వికలాం గుల బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, గహలక్ష్మి పథకంలో ఐదు శాతం కేటాయి ంచాలన్నారు. బదిరులు, అంధులు,శారీరక వికలాంగుల కోసం గురుకుల పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలన్నారు.వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం 2016ను పటిష్టంగా అమలు చేయాలన్నారు. ప్రతీ నియోకవర్గస్థాయిలో వికలాంగుల కోసం స్పెషల్ స్కూల్స్ ఏర్పాటు చేయాలనీ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కోనింటి నర్సింలు, ఆశ్వాక్, నియోజకవర్గ నాయకులు రాజుకుమర్, సంజీవ్, బిస్మిల్లా, శోభరాణి, సుభాష్, అంజాద్, మాణిక్, నారాయణ, చౌహాన్ రెడ్డి, శివరజు, రాజు, తదితరులు పాల్గొన్నారు.