నవతెలంగాణ-భిక్కనూర్
భిక్నూర్ పట్టణ కేంద్రంలో ఉన్న శ్రీ చైతన్య విద్యానికేతన్ పాఠశాలలో నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలు ఆల్బెండజోల్ పంపిణీ చేశారు. అనంతరం పాఠశాల కరస్పాండెంట్ రేణు కుమార్ మాట్లాడుతూ పిల్లలలో పోషకాహార లోపం, రక్తహీనత, శారీరక పెరుగుదల వంటి సమస్యలతో ఇబ్బంది పడకుండా ఉండడానికి ఆల్బెండజోల్ తప్పనిసరిగా వేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు అశోక్ యాదవ్, ఉపాధ్యాయులు రామాంజనేయులు, ఏఎన్ఎం శ్యామల, ఆశా వర్కర్ లావణ్య, తదితరులు పాల్గొన్నారు.