నవతెలంగాణ – ముంబయి: అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:24 గంటల సమయంలో సెన్సెక్స్ 46 పాయింట్ల లాభంతో 61,478 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 5 పాయింట్ల స్వల్ప లాభంతో 18,135 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.70 దగ్గర ప్రారంభమైంది. సెన్సెక్స్ 30 సూచీలో ఎస్బీఐ, హెచ్సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, నెస్లే ఇండియా, టెక్ మహీంద్రా, పవర్గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఐటీసీ, భారతీ ఎయిర్టెల్, ఎల్అండ్టీ, మారుతీ, టాటా స్టీల్, టైటన్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎన్టీపీసీ, బజాజ్ ఫైనాన్స్, ఎంఅండ్ఎం, టాటా మోటార్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. అమెరికా మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి. డెట్ సీలింగ్ పరిమితి పెంపుపై నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోయే అవకాశం ఉందన్న అంచనాలు అక్కడి మార్కెట్లలో ఉత్సాహం నింపాయి. మరోవైపు నేడు ఆసియా- పసిఫిక్ సూచీలు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. జపాన్ సూచీలు 33 ఏళ్ల గరిష్ఠాల వద్ద ట్రేడవుతున్నాయి. ఆర్థిక వ్యవస్థలో వృద్ధిలో వేగం, అంతర్జాతీయ ప్రతికూలతలను తట్టుకునే సామర్థ్యం లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని, భారత్కు ‘బీబీబీ-’ రేటింగ్ను కొనసాగిస్తున్నట్లు అమెరికా క్రెడిట్ రేటింగ్ సంస్థ ఎస్అండ్పీ వెల్లడించింది. ఈ రోజు జేఎస్డబ్ల్యూ స్టీల్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పవర్ గ్రిడ్, గ్లెన్మార్క్, జొమాటో వంటి కీలక కంపెనీల త్రైమాసిక ఫలితాలు వెలువడనున్నాయి. ఎఫ్ఐఐలు గురువారం రూ.970.18 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేయగా.. దేశీయ మదుపర్లు రూ.849.96 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు.