![](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/08/IMG-20230825-WA0456.jpg)
వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు తప్పకుండా పాటించాలని, వాహన ధ్రువపత్రాలు కలిగి ఉండాలని శుక్రవారం డీఎస్పీ ప్రకాష్ ప్రజలకు సూచించారు. మండలంలోని రంగంపేటలో కార్డెన్ అండ్ సెర్చ్ పోలీసులు నిర్వహించారు. ఈ సందర్భంగా 65 ద్విచక్ర వాహనాలు, రెండు ఆటోలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా డిఎస్పి ప్రకాష్ మాట్లాడుతూ…. ప్రజలు సైబర్ క్రైమ్ పట్ల అవగాహన కలిగి ఉండాలని, సైబర్ నేరగాళ్ల వలలో చిక్క కూడద, బ్యాంకు వివరాలను గోప్యంగా ఉంచుకోవాలని, సామాజిక మాధ్యమాల్లో వచ్చే లింకులను తాకరాదని, ఓటిపిలను గుర్తు తెలియని వ్యక్తులకు తెలపరాదని సూచించారు. రోడ్డు భద్రత నియమాల్లో భాగంగా ప్రతి వాహనదారుడు సీట్ బెల్టు, హెల్మెట్లను వినియోగించుకోవాలని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, మైనర్లకు వాహనాలు నడపడానికి ఇవ్వకూడదని సూచించారు. కార్యక్రమంలో సీఐ శ్రీనివాస్ గౌడ్, ఎంపీపీ దశరథ్ రెడ్డి, స్థానిక సర్పంచ్ శ్యామా గౌడ్, ఎస్సై సుధాకర్, పోలీస్ సిబ్బంది లక్ష్మీకాంత్, పవన్, రమేష్, బాబన్న, శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.