– చిరు వ్యాపారాలతో ఆర్థిక అభివృద్ధి సాధించాలి
నవతెలంగాణ-భీంగల్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐకెపి ద్వారా మహిళా సంఘాలకు అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకొని వాటి ద్వారా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఆర్థిక అభివృద్ధిని సాధించాలని డి ఆర్ డి ఓ పిడి చందర్ నాయక్ తెలిపారు. న్యూ ఎంటర్ప్రైజెస్ ద్వారా 3 లక్షల రుణంతో పురానిపేట గ్రామంలో ఏర్పాటు చేసిన సూపర్ మార్కెట్ ను పిడి ప్రారంభించారు .ఈ సందర్భంగా పిడి మాట్లాడుతూ మండలంలోని ఐకేపీ ఆధ్వర్యంలో అన్ని గ్రామాలలో మహిళా సంఘ సభ్యులు కిరాణా షాపులకు , జనరల్ స్టోర్స్ , ఆహార ఉత్పత్తులు పెంపొందించుటకు కులవృత్తులకు. బట్టల షాపులకు టైలరింగ్ లకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ఐకెపి ద్వారా మూడు లక్షల రూపాయల అందజేస్తుందని కనుక దీనిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు , ఇప్పటివరకు ఎంటర్ ప్రైజెస్ కింద మండలంలో 342 యూనిట్లను ఎంటర్ చేయడం జరిగింది అన్నారు యూనిట్లన్నీ వారం రోజుల్లో గ్రౌండ్ చేసి మహిళా సంఘ సభ్యులను ఆదాయ అభివృద్ధిలో పెంపొందించుటకు ఐకెపి సిబ్బంది కృషి చేయాలన్నారు మరియు బ్యాంకు లింకేజ్. శ్రీనిధి పుస్తకాల నిర్వహణ సమావేశాలు ఆన్లైన్ వర్క్స్ మరియు లోకస్ యాప్ పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏపిడి మధుసూదన్ డిపిఎం మారుతి, ఎంపీడీవో రాజేశ్వర్, సీనియర్ సిసి పురస్తూ నరేష్, ఐకేపీ సీసీ లు గంగ సాయిలు, గడల రఘుపతి, లలిత, సుమలత ,గణేష్ ముత్యం శ్రీనిది మేనేజర్ సురేష్. పాల్గొన్నారు