నవతెలంగాణ- మద్నూర్
రాష్ట్ర ప్రభుత్వం మద్యం అమ్మకాలపై పకడ్బందీ చట్టాలతో లైసెన్సులు జారీ చేస్తూ వస్తుంది ఎక్సైజ్ చట్టాలు వైన్స్ మద్యం అమ్మకాలపై చుట్టాలుగా మారాయని ఆరోపణలు ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి మద్యం సేవించే వ్యక్తులు మద్యం కొనుగోలు చేస్తే రసీదు ఇవ్వాలి. నిబంధనల ప్రకారం 18 సంవత్సరాలు పైబడిన వారికే అమ్మకాలు జరపాలి. మహిళలకు అమ్మకూడదు ఒక వ్యక్తి ఎన్ని బాటిళ్లు కొనాలి వారికి ఎన్ని ఇవ్వాలి అని నిబంధన ఉన్నప్పటికీ అలాంటి నిబంధనలు ఎక్సైజ్ శాఖ అధికారులు ఏ మాత్రం అమలు పరచడం లేదని ఆరోపణలు వ్యక్తమవుతున్న దానికి నిదర్శనం శనివారం సాయంత్రం నాలుగు కాటన్ల లిక్కర్ పట్టుబడ్డదే నిదర్శనం ఎందుకంటే ఒకే వ్యక్తి కాటన్ల కొలది మద్యం కొనుగోలు చేయడానికి ఎక్సైజ్ నిబంధనల ప్రకారం ఆస్కారమే లేనప్పటికీ వైన్స్ అమ్మకందారులు ఒకే వ్యక్తికి నాలుగు కాటన్ల మద్యం ఎలా ఇచ్చారు అలాంటి వారికి నిబంధనలు లేవా కొనేవారు బలి కావాలి అమ్మే వారిపై చర్యలు ఏవి అనే చర్చలు మండల ప్రజల్లో ఎక్సైజ్ శాఖ అధికారుల పని తీరుపై జోరుగా వినిపిస్తున్నాయి కొన్నోడు బలి కావాలి అమ్మే వారిపై చర్యలేవి నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని లైసెన్స్ జారీ చేసిన సమయంలో హెచ్చరికలు తెలియజేయడం జరుగుతుంది ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల మూలంగా గ్రామాల్లో బెల్ట్ షాపుల మద్యం అమ్మకాలను ఎక్సైజ్ శాఖ నిషేధించింది అయినప్పటికీ ఒక్కొక్క వ్యక్తి 4 కాటన్లు మద్యం తీసుకు వెళ్లడానికి వైన్స్ అమ్మకం దారులు ఏ విధంగా అనుమతి ఇచ్చారు ప్రస్తుతం ఎన్నికల సమయం పకడ్బందీ నిబంధనలు అమలుపరిచే ఎక్సైజ్ శాఖ అధికారులు ఒక వైపే చర్యలు తీసుకోవడం మరోవైపు చర్యలు చేపట్టకపోవడం మండల ప్రజల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.. పట్టుబడ్డ మద్యం ఎక్కడ కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన రసీదులు ఎక్కడ పట్టుబడ్డ వ్యక్తికి ప్రశ్నిస్తే ఎక్కడి నుండి కొనుగోలు చేసినది ఆయన చెప్తాడు ఆయన చెప్పే మాటలు వినకుండా అమ్మిన వైన్స్ దారులపై ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం వైన్స్ మద్యం అమ్మకాల పట్ల ఎక్సైజ్ శాఖ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని ఆరోపణలు ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి మొదట అమ్మే వారిపై చర్యలు తీసుకోవాలి అక్కడే నిబంధనలు పాటిస్తే కొనేవారు ఎలాగైనా పెద్ద మొత్తంలో మద్యం కొనుగోలు చేయలేక పోతారు వైన్స్ లో ఉల్లంఘన జరుగుతుంటే కొనుగోలుదారులపై చట్టాలు అమలు చేయడం ఏమిటి అనే ప్రశ్న ప్రజల్లో వ్యక్తం అవుతుంది నాలుగు కాటన్ల మద్యంపై ఎక్కడైతే కొనుగోలు చేశారో ఆ వైన్స్ యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు ఎక్సైజ్ శాఖ అధికారులకు కోరుతున్నారు.