![](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/08/IMG-20230804-WA0028.jpg)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రైతు రుణమాఫీతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం మండలంలోని వివిధ గ్రామాలతోపాటు చెంచల్చెర్వుపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ భీంరెడ్డి సత్యవతి`రాజిరెడ్డి ఆధ్వర్యంలో బస్టాండ్ వద్ద ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి హరీష్రావు, హుస్నాబాద్ ఎమ్మేల్యే సతీష్కుమార్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి, మిఠాయిలు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వంగా రైతు రుణాలను మాఫీ చేసి మరోసారి రైతు పక్షపాతిగా నిలిచిన ముఖ్యమంత్రి కెసిఆర్కు తెలంగాణ యావత్తు రైతులందరు అండగా ఉంటారని ఆశాభావం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు ఆవుల మహేందర్, గ్రామశాఖ అధ్యక్షులు భిక్షపతి, సోషల్ మీడియా నియోజకవర్గ ఉపాధ్యక్షులు శ్రీనివాస్ నాయకులు బాపిరెడ్డి, చిన్న మహేందర్, వార్డు సభ్యులు తిరుపతిరెడ్డి, మోహన్రెడ్డి, మల్లేషం, రవిందర్రెడ్డి, వెంకట్రెడ్డి, రవి, సంపత్, మహేందర్, యాదగిరి, లక్ష్మన్, యాదయ్య, శ్రీకాంత్, రాజయ్య, రాజలింగం, సత్యం, రాజయ్య, శ్రీనివాస్, ముకుందరెడ్డి, సంజీవరెడ్డి, కనుకరెడ్డి, లక్ష్మయ్య, కనుకయ్య తదితరులు పాల్గోన్నారు.