– ఏ ఐ కే ఎస్ జిల్లా ఉపాధ్యక్షులు దేవేందర్ సింగ్
నవ తెలంగాణ- నవీపేట్: రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఏఐకేఎస్ జిల్లా ఉపాధ్యక్షులు దేవేందర్ సింగ్ తాసిల్దార్ ధన్వాల్ కు గురువారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి కోతలు ప్రారంభమైన కొనుగోలు కేంద్రాలు ఇప్పటికీ ప్రారంభం కాలేదని, ఎంఎస్పీ ధరలకే ధాన్యం కొనుగోలు చేయాలని, తరుగు పేరుతో దోపిడీ జరగకుండా నిలువరించాలని కోరారు. గన్ని బ్యాగులు, లారీల కొరతలను నివారించాలని, టార్బాలిన్ కవర్లను అందుబాటులో ఉంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల అధ్యక్షులు మెగావత్ రామ్ సింగ్, కిషన్, గంగాధర్, గోవింద్ తదితరులు పాల్గొన్నారు.
నవ తెలంగాణ- నవీపేట్: రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఏఐకేఎస్ జిల్లా ఉపాధ్యక్షులు దేవేందర్ సింగ్ తాసిల్దార్ ధన్వాల్ కు గురువారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి కోతలు ప్రారంభమైన కొనుగోలు కేంద్రాలు ఇప్పటికీ ప్రారంభం కాలేదని, ఎంఎస్పీ ధరలకే ధాన్యం కొనుగోలు చేయాలని, తరుగు పేరుతో దోపిడీ జరగకుండా నిలువరించాలని కోరారు. గన్ని బ్యాగులు, లారీల కొరతలను నివారించాలని, టార్బాలిన్ కవర్లను అందుబాటులో ఉంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల అధ్యక్షులు మెగావత్ రామ్ సింగ్, కిషన్, గంగాధర్, గోవింద్ తదితరులు పాల్గొన్నారు.