నవతెలంగాణ-కొడంగల్
కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్లోకి దౌల్తాబా ద్ మండలం గుండేపల్లికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు పి.సాయిరెడ్డి, జోగు మొగులప్ప లు సర్పంచ్ మధుసూదన్ రెడ్డి, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు సాయిరెడ్డిల ఆధ్వర్యంలో కొడంగల్లోని మంజునాథ ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గులాబీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వా నించారు. వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకుల తీరు పట్ల బీఆర్ఎస్లో చేరుతు న్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే నరేందర్రెడ్డి మా ట్లాడుతూ..బీఆర్ఎస్ ఎదుగుదలకు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపునకు కృషి చేయా లన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయ కులు కడిచర్ల వెంకట్ రామ్రెడ్డి, కె. మహిపా ల్, పీహెచ్ నరసింహ తదితరులున్నారు.