![](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/10/Rape-Vicitms.jpg)
దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలో దారుణం చోటు చేసుకుంది. నోయిడాలోని ఓ ప్రయివేటు కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థిని (16)పై అదే క్లాసుకు చెందిన ఐదుగురు విద్యార్థులు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. ఒంటరిగా ఉన్న విద్యార్థిని బెదిరించి ఐదుగురు లైంగికదాడికి పాల్పడ్డారు. అనంతరం ఆమెపై దాడి చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.