నవతెలంగాణ – సూర్యాపేట: జిల్లా కేంద్రంలోని బాల్ భవన్ లో మ్యూజిక్ సౌండ్ సిస్టం కొరత ఉందని గమనించిన బాల్ భవన్ అభివృద్ధి కమిటీ గౌరవ అధ్యక్షురాలు గుంటకండ్ల సునీత జగదీష్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన మంత్రి స్వయం నిధులతో కొని నేడు క్యాంప్ కార్యాలయంలో యాభై వేల పై చిలుకు విలువైన మ్యూజిక్ సౌండ్ సిస్టం తో పాటు స్టూడెంట్స్ కు ఆటలు ఆడటానికి స్పోర్ట్స్ కిట్ కూడా అందించారు. ఈ సందర్భంగా మంత్రికి వారి సతీమణి సునీత మేడంకి బాల్ భవన్ సూపరింటెండెంట్ బండి రాధాకృష్ణ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాల్ భవన్ స్టాఫ్ దాసరి ఎల్లయ్య, ఉమా, సత్యనారాయణ సింగ్, అనిల్, వీరయ్య, అభివృద్ధి కమిటీ సభ్యులు విశ్రాంత అధ్యాపకుడు హమీద్ ఖాన్, సంధ్య, దివ్య రేఖ తదితరులు పాల్గొన్నారు.