నవతెలంగాణ- హైదరాబాద్ : గ్రూప్-2 విద్యార్థిని ప్రవళిక (23) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటనపై గవర్నర్ తమిళిసై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రవళిక మృతిపై 48 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని సిఎస్, డిజిపి, టీఎస్పీఎస్సీ కార్యదర్శిని గవర్నర్ ఆదేశించారు. అశోక్నగర్లోని ఓ హాస్టల్లో ఉంటూ గ్రూప్-2 పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్న ప్రవళిక.. ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీనిపై విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. తీవ్ర ఉద్రిక్తతల నడుమ ప్రవళిక అంత్యక్రియలు ప్రారంభమయ్యాయి.