– అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాం
– సీపీఐ(ఎం) సంగారెడ్డి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే.రాజయ్య
నవతెలంగాణ-పటాన్చెరు
పటాన్చెరు నియోజకవర్గం సమస్యలకు నిలయంగా మారిందని.. ఒక్కసారి సీపీఐ(ఎం)కు అవకాశం ఇస్తే.. సమస్యలను పరిష్కరించి అభివద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తామని ఆ పార్టీ సంగారెడ్డి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే.రాజయ్య అన్నారు. పటాన్చెరు సీపీఐ(ఎం) అభ్యర్థి మల్లికార్జున్ను గెలిపిం చాలని కోరుతూ మండలం లోని ఇస్నా పూ ర్, దత్తాత్రే గర్, ప్రముక్ నగర్ తదితర కాలనీల్లో బుధవారం విస్తతంగా ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పటాన్చెరు నియోజకవర్గం సమస్యలకు నిలj ుంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రో డ్లు, ఇండ్లు, ఇళ్ల స్థలలు వలస కార్మికుల సమస్యలు, కాంట్రాక్ట్ కార్మికుల సమ స్యలు ఎక్కడివక్కడే ఉన్నాయన్నారు. సమస్యలు పరిష్కా రం కావాలంటే సీపీఐ(ఎం)ను గెలిపించాలని కోరారు. ఈ నియోజ కవర్గంలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ లేదని, డిగ్రీ కాలేజీలు ఇంకా కావాలని, పాలిటక్నిక్ కళాశాల లేదని, ఐటిఐ మరోటి కావాలన్నారు. పాశ మైలారం, ఇస్నాపూర్, చిట్కుల్ ,పటాన్ చెరు, సుల్తాన్ పూర్, బొల్లారం, కాజీ పల్లి గడ్డపోతారం, అనేక ప్రాంతల్లో కాలుష్య సమస్య తీవ్రంగా ఉందన్నారు. ఈ సమ స్యలు పరిష్కారం కావాలంటే సీపీఐ(ఎం) అభ్యర్థిని గెలి పించాలని ప్రజానికానికి పిలుపునిచ్చారు. ఈ కార్య క్రమంలో పార్టీ నాయకులు నాగేశ్వరరావు, ప్రవీణ్ కుమార్, నాగ ప్రసాద్, ఏడుక ొండలు, మల్లేష్, లకన్, మహేశ్వర్రెడ్డి, సోమన్న, రాములు,శంకర్ పాల్గొన్నారు.
మల్లికార్జున్కు ప్రజల ఆదరణ..
నవతెలంగాణ-రామచంద్రాపురం
పటాన్చెరు నియోజకవర్గ సీపీఐ(ఎం) అభ్యర్థి మల్లికార్జున్కు ప్రజల నుంచి మంచి ఆదరణ లభి స్తున్నదని ఆ పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు సాయి లు అన్నారు. రామచంద్రాపురంలోని కాకతీ యన గర్, సాయినగర్, మయూరినగర్, జ్యోతి నగర్, అశోక్నగర్లో బుధవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సమస్యల పరిష్కారానికి ప్రజల, కార్మికుల గొంతును అసెంబ్లీలో మల్లికార్జున్ విని పిస్తారని.. కాబట్టి ఆయన్ను భారీ మెజార్టీతో గెలి పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అశోక్, బాబురావు, సురేష్, చంద్రయ్య, మల్లారెడ్డి, లీయకత్ అలీ, మహేష్, సత్యరాజు, త్రిమూర్తులు, నాగభూషణం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
సుల్తాన్పూర్లో
ఇంటింటి ప్రచారం
నవతెలంగాణ-అమీన్పూర్
నిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న సీపీఐ(ఎం) ఎమ్మెల్యే అభ్యర్థి మల్లికార్జున్ గెలిపించాలని కోరుతూ మండలంలోని సుల్తాన్పూర్లో ఆ పార్టీ నాయకులు బుధవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సుత్తి కొడవలి చుక్క గుర్తుపై ఓటు వేసి మల్లికార్జున్కు భారీ విజయాన్ని అందించాలన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో పార్టీ నాయకులు నర్సింహారెడ్డి, అమీన్పూర్ మండల నాయకులు, సీఐటీయూ నాయకులు, సుల్తాన్ పూర్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
బూర్జువా పార్టీలను ఓడించాలి..
– పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాణిక్
దోపిడి దారులకు కొమ్ము కాసే బూర్జువా పార్టీలను ఓడించి ప్రజల పక్షాన నిరంతరం పోరాడే సీపీఐ(ఎం)ను గెలిపించాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అతిమేల మాణిక్ ప్రజానీకానికి విజ్ఞప్తి చేశారు. పార్టీ అభ్యర్థి జొన్నలగడ్డ మల్లికార్జున్ను గెలిప ించాలని పటాన్చెరు పట్టణంలోని మార్క్స్ నగర్, గౌతం నగర్ కాలనీలలో ఇంటింటి ప్రచారం నిర్వహిం చారు. ఈ సందర్భంగా మాణిక్, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు యాదగిరిలు మాట్లాడుతూ.. ఎన్నికలప్పుడే పార్టీలు ఓట్ల కోసం ప్రజల దగ్గరికి వస్తాయని.. కల్లబొ ల్లి మాటలు చెప్పి ఓట్లు దండుకునే ప్రయత్నం చేసా ్తయన్నారు. కానీ సీపీఐ(ఎం) మాత్రం నిత్యం ప్రజల పక్షాన నిలబడి.. సమస్యల పరిష్కారానికి పోరాడుతుం దన్నారు. కాబట్టి ఆ పార్టీ అభ్యర్థి మల్లికార్జున్ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, సీఐటీయూ నాయకులు జైజ్ కుమార్, అర్జున్, ఎస్ ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు మహేష్, నాయకులు హరిష్, విష్ణు, బాలమణి, గీత, వాణి, నాయకులు పాల్గొన్నారు.