నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మైనారిటీల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తున్నదని సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ముస్లీం, క్రిస్టియన్ మైనారిటీల అభివృద్ది కోసం బడ్జెట్లో పెద్ద మొత్తంలో కేటాయింపులు చేసింది. 2023 – 2024 ఆర్ధిక సంవత్సరానికి రూ.2,200.33 కోట్లను కేటాయించింది. ఆర్ధిక చేయూతకోసం పథకాల రూపల్పన చేసింది. విదేశాలలో చదువుకునే మైనారిటి విద్యార్ధులకు ఓవర్సీస్ స్కాలర్ షిప్ పేరిట ప్రోత్సాహకాలు అందిస్తోంది. మైనారిటీ యువతను విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు రెసిడెన్షియల్ పాఠశాలలతో పాటు తెలంగాణ స్టేట్ మైనారిటీ స్టడీ సర్కిళ్లను నిర్వహిస్తోంది. షాదీ ముబారక్ పేరిట ముస్లీం పేద ఆడపిల్లల పెళ్లిల్లకు గడిచిన 9 ఏండ్లలో 2.68 లక్షల మందికి రూ. 2,258.17 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. క్రిస్టియన్ మైనారిటీలకు భవనాన్ని నిర్మించుకునేందుకు ఉప్పల్ భగాయత్లో 2 ఎకరాల స్థలం కేటాయించడంతో పాటు భవన నిర్మాణానికి అయ్యే నిధులను సమకూర్చింది. ఆర్థిక స్థితిగతుల కారణంగా ముస్లీం మైనారిటీలు వారి ఆడపిల్లల వివాహాలు చేయడానికి ఇబ్బందులు పడుతున్నారని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం షాదిముభారక్ స్కీం ను ప్రకటించింది. తగిన విధంగా నిధులు విడుదల చేసింది. నిరుద్యోగ సమస్యతో సతమత మవుతున్న మైనారిటి యువతకు చేయుత నిచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసింది. నాణ్యమైన ఉన్నత విద్యను అందించేందుకు 204 మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలను జూనియర్ కళాశాలలుగా మార్చింది. విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే మైనారిటీ యువకుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఓవర్సీస్ స్కాలర్షిప్ స్కీమ్ ను ప్రవేశపెట్టింది. మైనారిటీల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక కమిషనరేట్ను ఏర్పాటు చేసింది. ఇక్కడి నుండి రాష్ట్ర స్థాయి అధికారులు సంక్షేమ పథకాల అమలును పర్యవేక్షిస్తారు. ముస్లిం అనాథలకోసం హైదరాబాదులో రూ.39 కోట్లతో అనీస్ ఉల్ ఘుర్భా భవనాన్ని నిర్మిస్తున్నది. ముస్లింల పవిత్ర దర్గా రాజస్థాన్ లోని అజ్మీర్ వద్ద తెలంగాణనుంచి సందర్శనకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం రుబాత్ (అతిథి గహం) నిర్మించేందుకు రూ. 5 కోట్లు కేటాయించింది. ముస్లింల ప్రార్థనా స్థలాలు అయిన మసీదులు, మదర్సాల్లో ఉండే ఇమామ్, మౌజమ్ లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా రూ. 5వేల గౌరవ వేతనాన్ని 10 వేల మందికి అందిస్తున్నదని సమాచార పౌరసంబంధాల శాఖ తెలిపింది.