నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలోని యూనివర్సిటీల వైస్ చాన్స్లర్లతో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సైందర్ రాజన్ సోమవారం రాజ్భవన్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వంతో ఉన్న సమస్యల కారణంగా విద్యార్థులతో డైరెక్ట్గా మాట్లాడలేకపోతున్నానని అన్నారు. దేశాభివృద్ధికి విద్య ఒక పిల్లర్ వంటిదని, రాజ్భవన్లో డిజిటల్ లైబ్రరీని ప్రారంభిస్తున్నట్లు గవర్నర్ తెలిపారు.