నవతెలంగాణ- ఆర్మూర్
పట్టణంలోని“ ప్రవాస భారతీయుల హక్కులు సంక్షేమ వేదిక ” కార్యాలయంలో వేదిక అధ్యక్షుడు కోటపాటి నరసింహం నాయుడు ఆధ్వర్యంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో గత ఆరు నెలల క్రితం డిచ్ పల్లి లో ఆర్కె. ట్రావెల్స్ పేరుతో ఆఫీస్ పెట్టి వందలాది మందిని ముంచి పారిపోయిన షేక్ బషీర్ అనే ఏజెంటును ఇంతవరకు పట్టుకోకపోవడానికి కారణం ఏమిటో? డిచ్ పల్లి పోలీసులు చెప్పాల్సిందిగా కోటపాటి డిమాండ్ చేశారు. టెక్నాలజీ ఇంతగా అభివృద్ధి చెంది దాదాపు అన్ని రకాల కేసులను రెండు మూడు రోజుల్లోనే చేదిస్తున్న పోలీసులకు బషీర్ ను పట్టుకోవడం చేతకావడం లేదంటే నమ్మశ క్యంగాలేదు బషీర్ తో ఏదో చీకటి ఒప్పందం కుదుర్చుకొన్నడిచ్ పల్లి సీఐ గారు ఉల్టా మమ్మల్ని అడుగుతున్నాడు. ఎక్కడున్నా డో తెలిస్తే చెప్పండి పట్టుకొస్తాము అంటున్నారు డిచ్ పల్లి పోలీసులకు డిసెంబర్ 29 తేదీన, కమిషనర్ నిజామాబాద్ కు జనవరి 11 న, ఫిబ్రవరి నెలలో జిల్లా కలెక్టర్ కు, స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినప్పటికీ ఇంతవరకు ఒక నకిలీ ఏజెంట్ ను పట్టుకుంట లేరంటే ఏమనుకోవాలి. ఏదో డీల్ కుదిరిందని భావిస్తున్నాము. గత రెండు నెలలుగా C.P. Post. ఖాళీగా ఉంది. కాబట్టి నిజామాబాద్Addl. ACP గారు జోక్యం చేసుకొని వెంటనే కేసును డిచ్ పల్లి P.S. నుండి వేరే పోలీస్ స్టేషన్కు బదిలీ చేసి బషీర్ చేతిలో మోసపోయిన 500 మందికి న్యాయం చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాము. డిచ్ పల్లి పోలీసుల కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, కాబట్టి జిల్లా మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారు జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరించాల్సిందిగా త్వరలో బాధితులతో కలిసి వెళ్లి మంత్రిగారిని కోరనున్నాము. అదేవిధంగా షేక్ బషీర్ తో కుమ్మక్కు అయ్యి ప్రతి ఒక్కరి నుండి 5600/- తీసుకొని మెడికల్ టెస్టులు చేసిన, విజయ శ్రీ డయాగ్నొస్టిక్ సెంటర్ యజమానిని ఇంతవరకు అదుపులోకి తీసుకోకపోవడం వెనుక ఎవరు ఉన్నారో పోలీసులు సమాధానం చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాము. వెంటనే అతనిని కూడా అరెస్టు చేసి డబ్బులు రికవరీ చేయాల్సిందిగా కోరుతున్నాము. ఈ విషయంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే ఆర్టీసీ , చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ కూడా జోక్యం చేసుకొని బాధితులకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాము. జిల్లాలో ప్రతి నియోజకవర్గo నుండి 100 మందికి పైగా బాధ్యతలు ఉన్నారని కోటపాటి తెలిపారు ఈ కార్యక్రమంలో షేక్ బషీర్ బాధితుల సంఘం కన్వీనర్ రాకేష్ రైతు నాయకులు నక్కల చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు..