నవతెలంగాణ-హైదరాబాద్ : గ్రూప్ – 1 ప్రిలిమ్స్ పరీక్ష వాయిదా వేయాలంటూ తెలంగాణ హైకోర్టులో దాఖలైన పిటిషన్పై నేడు(గురువారం) విచారణ జరగనుంది. కోర్టు సెలవుల నేపథ్యంలో.. వేకేషన్ బెంచ్ ఈ పిటిషన్పై వాదనలు విననుంది. పరీక్షను వాయిదా వేయాలంటూ 36 మంది అభ్యర్థులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. గ్రూప్ – 1 ప్రిలిమ్స్పై స్టే విధిస్తూ.. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్ ద్వారా కోర్టును అభ్యర్థిస్తున్నారు. గతేడాది అక్టోబర్లో గ్రూప్ వన్ పరీక్ష జరిగింది. ఫలితాలు కూడా వెలువడ్డాయి. అయితే.. పేపర్ లీక్ వ్యవహారంతో గ్రూప్ – 1 ప్రిలిమ్స్ రద్దు చేసింది టీఎస్పీఎస్సీ. తిరిగి జూన్ 11 న పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది.