నవతెలంగాణ- మోపాల్: మోపాల్ మండలంలోని బో( పి) గ్రామంలో బుధవారం రోజున నూడా చైర్మన్ ఈగ సంజీవ రెడ్డి నివాసంలో రూరల్ నియోజకవర్గం ఆర్యానగర్ కాలనీ కి చేందిన 40 మంది యువకులు సంజీవరెడ్డి ఆధ్వర్యంలో కండువా కప్పుకొని బీఆర్ఎస్ పార్టీ లో చేరారు. ఈ సందర్బంగా యువత ను ఉద్దేశించి నూడా, ఒలింపిక్ చైర్మన్ మాట్లాడుతూ యువత చేడు మార్గం లో వెళ్లకుండా యువత కు క్రీడాల్లో క్రీడాకారులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ క్రీడాకారుల భవిష్యత్తు కు బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని అందుకని యువత చేడు మార్గాకు వెళ్లకుండా ఓపెన్ జిమ్ లను ఏర్పాటు చేస్తుందని అన్నరు. యువత ముందుండి రూరల్ ఎం ఎల్ ఎ బాజిరెడ్డి గోవర్ధన్ నీ భారీ మెజారిటీ తో గెలిపించాలని యువత కు సూచించారు. అలాగే మన రాష్ట్ర ఐటీ మంత్రి కేటీర్ కూడా యువత చేడు మార్గాలకు వెళ్లకుండా నిజామాబాదు లో ఐటీ హబ్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అలాగే కాలనీ కి సంబందించిన ఎటుకంటి సమస్య అయినా తన ద్రుష్టి కి తీసుక వస్తే నాతో కానీ లేదా ఎం ఎల్ ఎ బాజిరెడ్డి గోవర్ధన్ సహకారం తో పరిష్కారనికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమం లో ఈగ శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ యువ నాయకుడు సయ్యద్ నాభి, పార్టీ లో చేరిన కాలనీ యువకులు గదరి శ్యామ్ సుందర్ రెడ్డి, హరీష్ కుమార్, కీర్తి వర్ధన్ రెడ్డి, నితిన్ గౌడ్, విశాల్, మంగల్, లోకేష్, నిఖిల్, నర్సింహా, సాయి ఈశ్వర్, ఉదయ్, సాయిరాం, నంద కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు