నవతెలంగాణ – ఢిల్లీ
దేశరాజధాని ఢిల్లీలో గురువారం ఉదయం వర్షం పడింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రతలు 23.5 డిగ్రీలు కాగా, గరిష్ఠంగా 35 డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇన్ని రోజులూ తీవ్ర ఉక్కపోతతో ఇబ్బంది పడిన ప్రజలకు తాజా వర్షాలు ఉపశమనం కలిగించినట్లవుతోంది. అయితే వర్షం కారణంగా దేశంలోని పలు ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.