నవతెలంగాణ-హైదరాబాద్ : నగరంలోని పారడైస్ ప్రాంతంలో ఆయిల్ టాంకర్ బోల్తా పడటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సరోజిని ఆస్పత్రి సమీపంలో నుండి రోడ్డుపై ఆయిల్ డబ్బాల లోడ్ తో ఉన్న వాహనం నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయింది. టస్కర్ వాహనం నుండి పడిపోయాయి రెండు ఆయిల్ డబ్బాలు. వాహనాన్ని పక్కకు లాగి, ట్రాఫిక్ క్లియర్ చేస్తుంది సిబ్బంది. దీంతో వాహనాలను మెహిదీపట్నం.. కు మళ్లించారు. దీంతో, మెహిదీపట్నం మాసబ్ ట్యాంక్ మహావిర్ ఆస్పత్రి ఏరియాలలో భారీ ట్రాఫిక్ జాం అయింది. లకిడికాపూల్ నుండి మాసబ్ ట్యాంక్ మీదుగా మేదిపట్నం వెళ్లే దారిలో నిలిచిపోయాయి వాహనాలు. మాసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్, ఫ్లైఓవర్ కింది రోడ్లు, పెన్షన్ ఆఫీసు నుంచి మాసబ్ ట్యాంకు వచ్చే దారి లో వాహనాలు నిలిచిపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు.