నవతెలంగాణ – హైదరాబాద్: గుట్టుచప్పుడు కాకుండా విదేశాల నుండి అక్రమంగా సెల్ఫోన్లను తరలిస్తూ కస్టమ్స్ అధికారులకు పట్టుబడ్డ ఘటన శంషాబాద్ విమానాశ్రయంలో శనివారం చోటుచేసుకుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నిన్న టోరంటో నుండి హైదరాబాద్ వచ్చేందుకు ఓ ప్రయాణికుడు శంషాబాద్ విమానాశ్రయంలో దిగడంతో అతని పై అనుమానం వచ్చి కస్టమ్స్ అధికారులు అతని లగేజ్ బ్యాగ్ ను క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అతని వద్ద స్మార్ట్ ఫోన్లు ఉన్నట్లు గుర్తించారు. అతని అదుపులోకి తీసుకొని అతని వద్ద నుండి 37.70 లక్షల విలువ చేసే 35 (ఐపోన్లు- శామ్సంగ్) సెల్ ఫోన్లు ఒక స్మార్ట్ వాచ్ స్వాధీనం తీసుకొని కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.