నవతెలంగాణ-హైదరాబాద్ : గత కొన్ని రోజుల నుండి మణిపూర్ రాష్ట్రంలో ఒక చట్టం గురించిన వివాదం వలన ప్రజల్లో తీవ్రమైన తిరుగుబాటు రావడంతో రాష్ట్రము అంతటా హింసాత్మక పరిస్థితులు నెలకొనడంతో ప్రజలు అంతా ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్లిపోయారు. కొన్ని చోట్ల హింస చెలరేగుతోంది. కాగా ఈ హింసాత్మక ఘటనలకు బాధ్యత వహిస్తూ ఆ రాష్ట్ర సీఎం బీరెన్ సింగ్ రాజీనామా చేస్తున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వార్తపై వివరణ ఇవ్వడానికి సీఎం బీరెన్ సింగ్ స్వయంగా వచ్చారు.. నేను సీఎం పదవికి రాజీనామా చేయడం లేదని అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేడని తేల్చి చెప్పారు.