– అధికారంలోకి రాగానే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తాం
– కాంగ్రెస్ పార్టీ నియోజక వర్గ అభ్యర్థి ములుగు ఎమ్మెల్యే సీతక్క
నవతెలంగాణ – ములుగు
ములుగు నియోజక వర్గమే నా ఇళ్లు ప్రజలే నా కుటుంబం సభ్యులని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఏక కాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ నియోజక వర్గ అభ్యర్థి, ఎమ్మెల్యే సీతక్క అన్నారు. ములుగు మండలం లోని మదన పెల్లి,జగ్గన్న పేట, పత్తి పల్లి,గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే సీతక్క ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి సీతక్క మాట్లాడుతూ నేను ప్రజల మనిషిని ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తిని టూరిస్ట్ లు వస్తుంటారు పోతుంటారు కానీ నేను లోకల్ నన్ను ఓడించడానికి బీఆర్ఎస్ నాయకులు డబ్బు సంచులతో వస్తున్నారనీ నేను మిమ్ముల నమ్ముకున్న వాళ్ళు డబ్బులను నమ్ముకున్నారు.. నేను గెలిస్తే ప్రజలు గెలిచినట్లు వాళ్ళు గెలిస్తే డబ్బు గెలిచినట్లు అన్నారు. మన ఇండ్లకు వచ్చే వాళ్ళు గడిచిన 10 యేండ్లుగా ఎప్పుడైనా కనప డ్డారా ఒక్కసారి ఆలోచన చెయ్యండని అన్నారు. కష్టం వచ్చినప్పుడల్లా మీకు అండగా ఉన్నది తానేనని అన్నారు. మరీ వాళ్ళు కేవలం డబ్బులు ఇచ్చి ఓట్లు దండుకుందామని వస్తున్నారనీ అలాంటి బీఆర్ఎస్ నాయకులకు ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టాలని అన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి అధికారం లోకి రావడం కోసం ఒక్క అవకాశం ఇవ్వాలని వేడుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే అమలు చేస్తాం అని, అర్హులైన ప్రతి ఒక్కరికీ రైతు భరోసా ద్వారా ఉచిత విద్యుత్, 2 లక్షల రైతు రుణమాఫి, ప్రతి ఏటా పట్టాదారులకు 15 వేల రూపాయలు, కౌలు రైతులకు 12 వేల రూపాయలు, జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అను సంధానం చేసి వ్యవసాయాన్ని పండుగ చేస్తాం అని అన్నారు. గృహ జ్యోతి పథకం ద్వారా మహిళలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని అన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి మ హిళకు నెలకు 2500 రూపాయలు అందిస్తామని అన్నారు. చేయూత పథకం ద్వారా వద్దులకు, ఒంటరి మహిళలకు, వితంతువులకు, వికలాంగులకు, బీడీ కార్మికులకు ఇంట్లో ఎంత మంది ఉంటే అందరికీ 4000 రూపాయల పెన్షన్ అందిస్తామని అన్నారు.యువ వికాసం ద్వారా విద్యార్థులకు ఫీజ్ రీ ఇంబర్శుమెంట్ అందించి పేద విద్యార్థులందరికీ ఉచిత ఉన్నత విద్యను అందించి 5 లక్షల రూపాయల వరకు విద్యార్థులకు అందిస్తామని అన్నారు.రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ప్రతి ఏటా 10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని అన్నారు. అలాగే అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్ల ద్వారా నిర్మాణానికి 5 లక్షల రూపాయలు, ఎస్సి, ఎస్టీ లకు 6 లక్షల రూపాయలు కల్పిస్తాం అని, ఇండ్ల స్థలాలు లేని వారికి ఉచితంగా 250 గజాల ఇళ్ళ స్థలాన్ని కేటాయించి ఇల్లు నిర్మిస్తామని అన్నారు.
ఓడించేందుకు బీఆర్ఎస్ కుట్రలు
ములుగు నియోజకవర్గ ప్రజల కోసం నిస్వార్ధంగా పనిచేస్తున్న నన్ను ఓడించేందుకు బీఆర్ఎస్ నేతలు కుట్రలు పన్నుతున్నారని ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. ములుగు జిల్లా కేంద్రంలో సోమవారం ఆమె విలే కరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా కష్ట కాలంలో నిస్వార్ధంగా సేవ చేశారని మెచ్చుకున్న మంత్రి హరీష్ రావు నేడు ప్రజాక్షేత్రంలో నన్ను గెలవలేక కుటిలయత్నాలకు పాల్పడుతుండటం దురదష్టక రమని ఆమె అన్నారు. వార్డు మెంబర్గా కూడా గెలవలేని మంత్రి హరీష్ రావు సెంటిమెంట్ పేరుతో, ఉద్యమం పేరుతో నేడు మంత్రిగా పదవులు అనుభవిస్తున్నాడని ఆరోపించారు. నిరుపేద, గిరిజన తెగకు చెందిన తనను అభివృద్ధి చెందకుండా సిడిఎఫ్ నిధులు నిలిపివేసి నియోజ కవర్గ ప్రజల అభివద్ధిని అడ్డుకునేందుకు ప్రయత్నించడం దురదష్టకరమన్నారు. తనకు సన్నిహితంగా ఉంటూ పార్టీ అభివృద్ధికి పని చేసిన వ్యక్తులను లక్షల రూపాయలు పెట్టి కొంటున్నారని ఆరోపించారు. స్లీపింగ్ ఇన్చార్జిగా మంత్రి హరీష్ రావు పనిచేస్తూ సీతక్క ఓటమి కోసం రూ.50 కోట్లు ఇప్పటికే ఖర్చు చేశారని, మరో వంద కోట్లు ఖర్చు పెట్టాలని చూసినా ప్రజాభిమానం ఉన్న సీతక్క ఓటమిని అడ్డుకోలేరని హితవు పలికారు. పిసిసి రవళి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.