నవతెలంగాణ-పర్వతగిరి
సంక్షేమ పథకాల అమలు కాంగ్రెస్ తోనే సాధ్యం అవుతుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జాటోతు శ్రీనివాస్ నాయక్ అన్నారు. మండలం కేంద్రంలో సోమవారం దేవిలాల్ తండాలో గడప గడపకు వెళ్లి ఆరు గ్యారెంటీ పథకాల అమలు పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బాగంగా మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం రావాలంటే కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు పై ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కేఆర్ నాగరాజు కు భారీ మెజార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు మెజార్టీ వలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పర్వతగిరి ఎంపీటీసీ బొట్ల మహేంద్ర, సీనియర్ నాయకులు సునీల్ రావు, సొసైటీ డైరెక్టర్ గంగాధర్ రావు, సొసైటీ డైరెక్టర్ చిదురు కిష్టయ్య, పర్వతగిరి టౌన్ అధ్యక్షులు కూసం రామచందర్, బూత్ కన్వీనర్లు పోకల శంకర్, గుగులోతు భాస్కర్, కిసాన్ సెల్ మండల ఉపాధ్యక్షులు జూలపల్లి సురేందర్ రావు, నరసయ్య, వెంకన్న, కిషన్, జాటోతు రవీందర్, వీరన్న, సీనియర్ నాయకులు కంటెం సుధాకర్, యాకూబ్, విజేందర్, తదితరులు పాల్గొన్నారు.
పర్వతగిరి:
వర్ధన్నపేటనియోజకవర్గ పర్వతగిరి మండలం లోని ఏనుగల్లు గ్రామంలో సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాల గురించి వర్ధన్నపేట ఎమ్మెల్యే అభ్యర్థి కే ఆర్ నాగరాజు గెలుపు కోసం కాంగ్రెస్ నాయకులు సోమవారం గడప గడప వెళ్తూ గ్యారంటీ పతాకాలపై ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమం లో ఏనుగల్ గ్రామ పార్టీ అధ్యక్షులు తొర్రి కుమారస్వామి, నియోజక వర్గం మహిళా సీనియర్ నాయకురాలు తొర్రి పద్మ,ధోనీ సంపత్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.అలాగే మండలం లోని ఆయా గ్రామాల్లో చల్లా వెంకన్న ఆధ్వర్యం లో దళితులు ప్రచారం లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో బొట్ల కనకరాజు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కాశిబుగ్గ:
ప్రజల ఆకా ంక్షను గౌర వించి ప్ర త్యేక తెల ంగాణ రాష్రా ్టన్ని ఇచ్చిన కాం గ్రెస్ పార్టీకి ఒక్క అవ కాశం ఇవ్వా లని కాం గ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు జన్ను అరుణాకర్ కోరారు. సోమవారం గ్రేటర్ వరంగల్ మూడవ డివిజన్ పైడిపల్లిలో వర్ధన్నపేట కాంగ్రెస్ అభ్యర్థి నాగరాజు గెలుపు కోరుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో లో పేర్కొన్న ఆరు గ్యారెంటీ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ప్రజలంతా చేతి గుర్తుకు ఓటు వేసి నాగరాజును భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జన్ను జెసన్, హనుమకొండ ఏలియా, జన్ను విజయసాగర్, నక్క జాషువా, కడారి మోజస్, సింగారపు అజరు, ఇనుగాల సుధాకర్, సుదర్శన్, రాజు, విజయ, తదితరులు పాల్గొన్నారు.