నవతెలంగాణ -హైదరాబాద్: నేడు బంగారం ధరలు పెరగ్గా.. వెండి ధరలు కాస్త తగ్గాయి. దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర నేడు రూ. 71,400లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై రూ. 500 తగ్గింది. ముంబైలో కిలో వెండి ధర రూ.71,400లుగా ఉండగా.. చెన్నైలో రూ. 74,800లుగా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 71,250గా ఉండగా.. హైదరాబాద్లో రూ. 74,800లుగా నమోదైంది. ఇక విజయవాడ, విశాఖపట్నంలో కూడా కిలో వెండి ధర రూ. 74,800ల వద్ద కొనసాగుతోంది.