నవతెలంగాణ – హైదరాబాద్: భారత్ – సౌతాఫ్రికా మధ్య ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా నిర్దేశించిన 327 పరుగుల ఛేదనలో సఫారీలు ఆది లోనే కాడి ఎత్తేశారు. భారీ ఛేదనలో సౌతాఫ్రికా 13 ఓవర్ల లోపే ఐదు కీలక వికెట్లు కోల్పోయింది. మహ్మద్ సిరాజ్ దక్షిణాఫ్రికా వికెట్ల పతనాన్ని మొదలుపెట్టగా జడేజా, షమీలు సౌతాఫ్రికాకు వరుస షాకులిచ్చి సఫారీలను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టారు. ఆ జట్టులో డికాక్, బవుమా, మార్క్రమ్, క్లాసెన్, డసెన్లు పెవిలియన్కు చేరారు. వరల్డ్ కప్లో ఇదివరకే నాలుగు సెంచరీలు బాది భీకరమైన ఫామ్లో ఉన్న సఫారీ ఓపెనర్ క్వింటన్ డికాక్ (5)ను తాను వేసిన తొలి ఓవర్లో మూడో బంతికే బౌల్డ్ చేసిన సిరాజ్ సౌతాఫ్రికాకు తొలి షాకిచ్చాడు. 14 ఓవర్లు ముగిసేసరికి సఫారీలు 5 వికెట్ల నష్టానికి 42 పరుగులు చేశారు.