నవతెలంగాణ-హైదరాబాద్: ఆసియా క్రీడల్లోభారత్ మరో స్వర్ణం సాధించింది. మహిళల కాంపౌండ్ ఆర్చరీ టీమ్ విభాగంలో భారత ఆర్చర్లు జ్యోతి వెన్నం, అదితి స్వామి, పర్నీత్ కౌర్ బృందం గోల్డ్ నెగ్గింది. చైనీస్ తైపీపై భారత్ బృందం విజయం సాధించింది. టీమ్ఇండియా బృందం 230-229 తేడాతో గెలిచింది. దీంతో మన ఖాతాలో 19వ పసిడి పతకం చేరింది. మొత్తం పతకాల సంఖ్య 82కి చేరింది. ఇందులో 19 స్వర్ణాలు, 31 రజతాలు, 32 కాంస్య పతకాలు ఉన్నాయి.