నవతెలంగాణ – ముంబాయి: ముంబై వాంఖడే స్టేడియంకి బెదిరింపు మెసేజ్ రావడం కలకలం రేపుతోంది. భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ జరిగే సమయంలో ఘోరం జరుగుతుందని తమకు X లో మెసేజ్ వచ్చిందని ముంబై పోలీసులు వెల్లడించారు. ‘గుర్తుతెలియని వ్యక్తి నుంచి మెసేజ్ వచ్చింది. వాంఖడే స్టేడియంలో గోరం జరుగుతుందని చెప్పాడు. తుపాకీ, హ్యాండ్ గ్రనైడ్స్, బుల్లెట్స్ చూపించాడు. భద్రత కట్టుదిట్టం చేశాం’ అని పోలీసులు తెలిపారు. కాగా.. సెమీస్ పోరులో నేడు న్యూజిలాండ్ తో భారత్ తలపడుతోంది. ముంబై వాంకడే స్టేడియంలో మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.