నవతెలంగాణ – మీర్పూర్: భారత్ – బంగ్లాదేశ్ మహిళా క్రికెట్ జట్ల మధ్య ఆదివారం వన్డే సిరీస్ ప్రారంభమైంది. ఇవాళ తొలి వన్డే జరుగుతున్నది. భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. బంగ్లాదేశ్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. వన్డే సిరీస్లో భాగంగా భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్లు జరుగనున్నాయి. ఇప్పటికే పూర్తయిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత్ 2-1 తేడాతో విజయం సాధించింది. కాగా, ప్రస్తుతం భారత జట్టు బౌలింగ్ బలంగా ఉన్నప్పటికీ బ్యాటింగ్లో కాస్త బలహీనత కనబడుతోంది. ఆఖరి టీ20లో భారత్ ఓటమికి బ్యాటర్ల వైఫల్యమే కారణంగా చెప్పవచ్చు. ఇక వన్డే సిరీస్లో ఏ జట్టు ప్రదర్శన ఎలా ఉంటుందో చూడాలి.