నవతెలంగాణ-హైదరాబాద్ : భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈజిప్టుకు చేరుకున్నారు. ఈజిప్టులో మోడీకి ఆ దేశ ప్రధాని ముస్తఫా ఘన స్వాగతం పలికారు. 1997 తర్వాత భారత ప్రధాని ఈజిప్టులో అడుగుపెట్టడం ఇదే తొలిసారి. మోడీ పర్యటన రెండు రోజుల పాటు కొనసాగనుంది. తన పర్యటనలో భాగంగా ఈజిప్టు, పాలస్తీనాల్లో ఉండి పోరాడి మరణించిన భారతీయ సైనికులకు మోడీ నివాళి అర్పించనున్నారు. అతి పురాన అల్ హకీమ్ మసీదును సందర్శిస్తారు. ఈజిప్టు ప్రధానితో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొంటారు.