నవతెలంగాణ హైదరాబాద్: చైతన్యపురి నారాయణ కాలేజ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోన్న మంచాల వైభవ్(16) సూసైడ్ నోట్ రాసి మీర్ పేట జిల్లెలగూడలోని తన నివాసంలో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అధ్యాపకులు, ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ ల వేధింపులు, ఒత్తిడి భరించలేకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు లేఖలో రాశాడు.
అమ్మానాన్న తనను క్షమించాలని కోరుతూ.. తమ్ముడిని మంచి కాలేజీలో జాయిన్ చేయాలని కోరాడు. ఎక్కువ మార్కుల కోసం అధ్యాపకులు, యాజమాన్యం స్టూడెంట్స్ పై ఒత్తిడి చేయొద్దని లేఖలో తెలిపాడు. అందరూ క్షమించాలని… ఇదే తన చివరి రోజు అని లెటర్ లో రాశాడు. విద్యార్థి ఆత్మహత్యతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.