నవతెలంగాణ-చెన్నై: తమిళనాడ డీఎంకే పార్టీ ఎంపీ ఎస్. జగత్రక్షకన్ ఇల్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. రాజధాని చెన్నైతోపాటు కోయంబత్తూరు, వేలూరు సహా రాష్ట్ర వ్యాప్తంగా 40కి పైగా చోట్ల అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. జగత్రక్షకన్కు చెందిన విద్యాసంస్థల్లోనూ తనిఖీలు చేస్తున్నారు. చెన్నైలోని పలు హోటళ్లు, ప్రైవేట్ దవాఖానలపైనా ఐటీ అధికారులు దాడులు చేశారు. మనీలాండరింగ్ కేసులో గత జూలైలో మంత్రి వీ.సెంథిల్ బాలాజీని ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.