నవతెలంగాణ- కంఠేశ్వర్:
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో మూడు రోజులపాటు (అక్టోబర్ 15,16,17) పెద్ద ఎత్తున నిర్వహించబడే మహాసభలు జాతీయ విద్యా విధానం 2020 అమలు నేపథ్యంలో విద్య రంగంలో చోటు చేసుకునే పరిణామాలు, మంచి ప్రభుత్వ బడి– మంచి విద్య ప్రజలందరి హక్కు కేంద్రంగా మూడు రోజులు మహాసభలలో తొమ్మిది అంశాలపై విస్తృతంగా, ప్రసంగాలు చర్చించిన అనంతరం మహబూబ్నగర్ డిక్లరేషన్ పేరుపై విద్యారంగంపై ఒక డాక్యుమెంటును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అమలు కొరకు డిటిఎఫ్ రాష్ట్ర కమిటీ నివేదించడం జరుగుతుంది. మహాసభల మొదటి రోజు 15 తేదీ ఉదయం 10.30 గంటలకు మహాసభల ప్రారంభోత్సవాన్ని ప్రొఫెసర్ జగ్మోహన్ సింగ్ ప్రారంభింస్తారు. డిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎం సోమయ్య అధ్యక్షత వహిస్తారు. డి టి ఎఫ్ మహాసభల నివేదికను ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి ప్రవేశపెడతారు. మహాసభల స్వాగతోపన్యాసం ప్రొఫెసర్ హరగోపాల్ ఇస్తారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రొఫెసర్ డి. నరసింహారెడ్డి, ప్రొఫెసర్ పద్మజాషా, మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ రవి గుగులోతు, ఉమ్మడి జిల్లా విద్యాశాఖ అధికారులు, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, డి టి ఎఫ్ ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షులు కే. నరహరి, డి టి ఎఫ్ తెలంగాణ అధ్యక్షులు ఎం. సోమయ్య, ప్రధాన కార్యదర్శి టి. లింగారెడ్డి, అధ్యాపక జ్వాల ప్రధాన సంపాదకులు డాక్టర్ ఎం. గంగాధర్, మహాసభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు ఈ మహాసభల లో డిటిఎఫ్ పతాకావిష్కరణ రాష్ట్ర అధ్యక్షులు ఎం. సోమయ్య నిర్వహిస్తారు. ఈ మూడు రోజుల మహాసభలలో రాష్ట్రంలోని నలుమూలల నుండి డిటిఎఫ్ శ్రేణులు, విద్యార్థులు, యువజనులు మేధావులు పాల్గొంటారు. రెండవ రోజు కార్యక్రమంలో భాగంగా మధ్యాహ్నం 3 గంటలకు మహాసభల ప్రాంగణం నుండి భారీ ర్యాలీ ప్రారంభమై ప్రభుత్వ మోడల్ బేసిక్ హై స్కూల్ మైదానంలో బహిరంగ సభ ఉంటుంది. ఇట్టి బహిరంగ సభలో వక్తలుగా మాధురి, (జాగృతి ఆదివాసి దళిత సంఘటన మధ్యప్రదేశ్), డాక్టర్ ఎం.ఎఫ్. గోపీనాథ్, (భారత్ బచావో జాతీయ ఉపాధ్యక్షులు) ఏం. రాఘవ చారి (కన్వీనర్ పాలమూరు అధ్యయన వేదిక) ఎం సోమయ్య డి టి ఎఫ్ అధ్యక్షులు టి. లింగారెడ్డి, ప్రధాన కార్యదర్శి, ఎం ఎన్ క్రిష్టప్ప పూర్వ ప్రధాన కార్యదర్శి, ఎం. రఘు శంకర్ రెడ్డి పూర్వ అధ్యక్షులు మొదలైన వారు బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మొదటి రోజు మొదటి సమావేశంలో జాతీయ విద్యా విధానం– 2020 ఉన్నత విద్యారంగంలోని సవాళ్లు అనే అంశంపై ప్రొఫెసర్ వికాస్ గుప్తా (ఢిల్లీ యూనివర్సిటీ), రెండవ సమావేశంలో సంక్షుబిత సమాజంలో రాజకీయ ఆర్థిక పరిస్థితులు అనే అంశంపై ఎన్. వేణుగోపాల్ (వీక్షణం ఎడిటర్) రెండవ రోజు (16,న )మూడవ సమావేశంలో వ్యవసాయ రంగం –రైతాంగ ఉద్యమాలు కన్నెగంటి రవి (రైతు స్వరాజ్య వేదిక) నాలుగవ సమావేశం ప్రభుత్వాల పాలనలో ప్రజల హక్కులు అనే అంశంపై ప్రొఫెసర్ జి.హరగోపాల్ (హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ) ఐదవ సమావేశంలో ప్రజాస్వామ్యంలో ప్రసార మాధ్యమాల పాత్ర అనే అంశంపై కే.శ్రీనివాస్ (ఆంధ్రజ్యోతి ఎడిటర్) ఆరవ సమావేశంలో సాహిత్యం– మహిళలు అనే అంశంపై ప్రొఫెసర్ కాత్యాయని విద్మహే (కాకతీయ యూనివర్సిటీ) మూడవరోజు ( 17న) సాంస్కృతిక రంగంలో తిరోగమన ధోరణులు అనే అంశంపై వరలక్ష్మి (విరసం) ఎనిమిదవ సమావేశంలో జాతీయ విద్యా విధానం– 2020 పాఠశాల విద్యా రంగంలోని సవాళ్లు అనే అంశంపై డి. రమేష్ పట్నాయక్ (అఖిలభారత విద్యా హక్కు వేదిక) చివరగా తొమ్మిదవ సమావేశంలో కార్పొరేటీకరణలో దళితులు ఆదివాసిలు అనే అంశంపై ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ (హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ) ప్రసంగాలు ఉంటాయి . ఈ మహాసభలలో హాజరయ్యే ప్రతినిధులకు భోజన, వసతులు కల్పించబడతాయి. మహాసభల ముగింపు సందేశాన్ని ఆహ్వాన సంఘ అధ్యక్షులైన ప్రొఫెసర్ జి. హరగోపాల్ సందేశంతో మహాసభలు ముగుస్తాయి అని తెలియజేశారు.