Salute Uttar Pradesh police for your kindness with physical Disable Man. pic.twitter.com/okMtVfer3E
— The Dalit Voice (@ambedkariteIND) July 30, 2023
నవతెలంగాణ – ఉత్తరప్రదేశ్
దాహం తీర్చుకునేందుకు మంచి నీళ్లు అడిగిన ఓ వికలాంగుడ్ని ఇద్దరు జవాన్లు చావచితక కొట్టిన ఘటన ఉత్తరప్రదేశ్లోని దేవరీయా ప్రాంతంలో వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే, 2016లో జరిగిన ఓ రైలు ప్రమాదంలో సచిన్ అనే వ్యక్తి తన రెండు కాళ్లూ కోల్పోయాడు. ప్రస్తుతం అతడు స్థానిక రెస్టారెంట్లో డెలివరీబాయ్గా జీవనం సాగిస్తున్నాడు. కాగా, శనివారం రాత్రి తన వాహనంపై ఇంటికి బయలుదేరిన అతడికి రోడ్డు మీద ఓ తాబేలు కనిపించింది. అతడు దాన్ని తీసుకుని ఆలయ సమీపంలోని కొలనులో విడిచిపెట్టాడు. ఆ తరువాత అక్కడ కనిపించిన ఇద్దరు ప్రాంతీయ రక్షక్ జవాన్లను మంచినీళ్లు అడిగాడు. ఈ మాత్రానికే వారు రెచ్చిపోయి అతడిని చావచితక కొట్టారు. సమీపంలోని ఓ వ్యక్తి ఈ ఉదంతాన్ని రికార్డు చేసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఇది వైరల్గా మారింది. విషయం పోలీసుల వరకూ వెళ్లడంతో వారు రంగంలోకి దిగారు. నిందితులను రాజేంద్ర మణి, అభిషేక్ సింగ్గా గుర్తించారు. వారిని విధుల నుంచి తొలగించినట్టు జిల్లా ఎస్పీ మీడియాకు తెలిపారు.