నవతెలంగాణ-హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఈ నెల 4వ తేదీన జరిగిన జేఈఈ అడ్వాన్స్డ్ ప్రాథమిక ‘కీ’ను ఐఐటీ గువాహటి ఆదివారం విడుదల చేసింది. వాటిపై అభ్యంతరాలుంటే సోమవారం సాయంత్రం 5 గంటలలోపు ఆన్లైన్ ద్వారా సమర్పించాలని అభ్యర్థులకు సూచించింది. ప్రాథమిక ‘కీ’ ప్రకారం తెలుగు రాష్ట్రాల నుంచి ముగ్గురు లేదా నలుగురు తొలి 10 ర్యాంకుల్లో నిలిచే అవకాశముందని జేఈఈ నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశవ్యాప్తంగా సుమారు 1.80 లక్షల మంది పరీక్ష రాశారు.