నవతెలంగాణ -ఆర్మూర్
జిల్లాలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటనతో నియోజకవర్గంలో పార్టీ శ్రేణుల యందు నూతన ఉత్తేజం ఉరకలేసినట్లు అయింది. విజయభేరి బస్సు యాత్రలో భాగంగా జిల్లాలోని మోర్తాడ్కేసీ, ఆర్మూర్ లో ప్రధాని నరేంద్ర మోడీ తప్పుడు వాగ్దానాలతో పసుపు రైతులను మోసం చేసినారని గత నాలుగున్నర సంవత్సరాల నుండి రైతులకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకోకుండా పది రోజుల్లో పసుపు బోర్డు అంటూ ఎన్నికల వేల మళ్లీ మోసం చేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ లోని ఒక్కో కార్యకర్త ఒక్కొక పులితో సమానమంటూ పార్టీ శ్రేణులు నూతన జోష్ ను పెంచారు. రైతుల అంశాలే ఏజెండాగా ముందుకెళ్ళింది.. పసుపు బోర్డు సాధన కోసం జిల్లా ప్రాంతా రైతులు రాజకీయ పోరాటాలు సైతం చేసినారు.. గత లోక్సభ ఎన్నికలలో 178 మంది పసుపు రైతులు జిల్లా పార్లమెంటు స్థానానికి నామినేషన్లు వేయడం అది వారణాసికి వెళ్లి నామినేషన్లు వేసేందుకు తరలి వెళ్లడం తీవ్ర చర్చనీయం అయింది.. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ నిజాం షుగర్స్ ను తెరిపించడంతోపాటు రైతులకు ప్రాధాన్యత అంశమైన పసుపు గడ్డాగా పేరున్న ఆర్మూర్ సభలో మోడీ ,కేసీఆర్ ప్రభుత్వాలపై ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ కు కంచుకోట ఆర్మూర్..
1952 సంవత్సరం భాష ప్రతిపాదికన రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత నియోజకవర్గం ఏర్పాటయింది.. ఇప్పటివరకు 15 సార్లు ఎన్నికలు జరిగితే ఎనిమిది మంది ప్రాతినిధ్యం వహించారు.. అయితే మొదటిసారి బిసి సామాజిక వర్గానికి చెందిన అర్గుల రాజారాం సోషలిస్టు పార్టీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్పై విజయ డంక మోగించారు. రాజారాం క్యాబినెట్ మంత్రిగా పనిచేసే రాష్ట్రంలోనే కీలక నేతగా అందరి మదిలో మీదిలారు .నియోజకవర్గ చరిత్రలో కాంగ్రెస్ కు ఆర్మూర్ కంచుకోటగా నిలిచింది.1962,1967,1972, ఎన్నికలలో తుమ్మల రంగారెడ్డి కాంగ్రెస్ నుండి గెలుపొందగా,1978,1983,1989,2004 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుండి శనిగరం సంతోష్ రెడ్డి గెలుపొందారు.1999 లో బాజిరెడ్డి గోవర్ధన్ గెలుపొందారు. తొలి తరంలో తుమ్మల రంగారెడ్డి మూడుసార్లు వరుసగా గెలిచి ఆర్మూర్ కాంగ్రెస్ కంచుకోటగా మార్చారు.. ఆ తరువాత 1962లో ఏకగ్రీవంగా ఎన్నిక కావడం గమనర్హం..
కకమ్మర్ పెళ్లి మండలంలోని చౌటుపల్లి స్వగ్రామానికి చెందిన కేతిరెడ్డి సురేష్ రెడ్డి తాత హనుమంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లా జడ్పీ చైర్మన్గా పనిచేసే నారు 1989 సంవత్సరం బాల్కొండ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా సురేష్ రెడ్డి గెలుపొంది అదే నియోజకవర్గం నుండి నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు .వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 2004లో నాలుగోసారి గెలిచిన ఆయనకు రాష్ట్ర స్పీకర్ గా 5 సంవత్సరాలు పదవిలో కొనసాగినారు.
కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపిన రేవంత్ రెడ్డి యాత్ర..
జిల్లాకు చెందిన రైతులు ,రైతు సంఘాల నేతలు కుల సంఘాల నేతలు, గల్ఫ్ బాధితులు విద్యార్థి సంఘాల నేతలతో టి పి సి సి అధ్యక్షులు రేవంత్ రెడ్డి నియోజకవర్గాల వారీగా పలు ప్రాంతాలను సందర్శించి సమస్యలను తెలుసుకొని భరోసా నింపి ప్రయత్నం చేశారు గత మార్చి 17న పట్టణంలో జరిగిన కార్నర్ సమావేశం తో కాంగ్రెస్ లో ఉత్సాహం పెరిగింది. 20 19 లో పట్టణంలో జరిగిన రైతు దీక్షలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.. తిరిగి ఎన్నికల రాహుల్ పర్యటన హస్తం లో మరింత జోష్ను పెంచింది.
కారు స్పీడ్ కు హస్తం బ్రేక్ లేసేనా…
భృఆర్ఎస్ ఎమ్మెల్యేగా రెండు పర్యాయాలు గెలుపొందిన ఆశన్న గారి జీవన్ రెడ్డి కారు స్పీడ్ కు కాంగ్రెస్ అభ్యర్థి వినయ్ రెడ్డి బ్రేకులు వేసేందుకు దూకుడు పెంచుతున్నారు.
ప్రజలకు సంక్షేమ పథకాలు చెరువ అవుతాయి..
కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ అవుతాయని,, నియోజకవర్గంలోని హత్య రాజకీయాల,, బెదిరింపుల సంస్కృతి నడుస్తుందని ,,లక్కంపల్లి సేజ్,, లేద రు పార్కు పరిస్థితి, డబుల్ బెడ్ రూమ్ లో ఇల్లు హామీ గా వదిలేశారు.