నవతెలంగాణ-హైదరాబాద్ : కేరళలోని పథనంతిట్ట జిల్లాలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. విడాకుల కేసులో తనకు న్యాయం జరగలేదని భావించిన ఓ వ్యక్తి న్యాయమూర్తి కారుపై తన ఆక్రోశం ప్రదర్శించాడు. కోర్టు ఆవరణలో నిలిపి ఉంచిన కారు అద్దాలను పగలగొట్టాడు. కారుకు సొట్టలు పడేలా రెచ్చిపోయాడు. తిరువళ్లా కోర్టు వద్ద బుధవారం ఈ ఘటన వెలుగు చూసింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆరేళ్లుగా ఈ కేసుపై కోర్టులో వాదోపవాదాలు జరుగుతున్నాయి. ‘భార్యే అతడిపై విడాకుల పిటిషన్ దాఖలు చేసింది. అయితే, న్యాయవాది, జడ్జి కుమ్మక్కై తన గోడు సరిగా ఆలకించలేదని అతడు కోపోద్రిక్తుడయ్యాడు అని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.