నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారం చాలా విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే 70 నియోజక వర్గాల్లో ప్రచారం చేశారు. ఇక ఇప్పుడు రెండో విడత ప్రచారం లో దూసుకుపోతున్నాడు. ఇందులో భాగంగానే.. ఎన్నికల ప్రచారం లో భాగంగా నేడు బోధన్, నిజామాబాద్ అర్బన్, ఎల్లారెడ్డి ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నారు. బోధన్ నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొంటారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జిజీ కళాశాల గ్రౌండ్ లో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొంటారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంలోని సభలో కేసీఅర్ పాల్గొంటారు. ఈ మేరకు ప్రత్యేక హెలికాప్టర్ లో నేడు నిజామాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు.