నవతెలంగాణ-హైదరాబాద్: జర్నలిజం రంగంలో 47 ఏళ్ల సుదీర్ఘ అనుభవం, ‘బాబాయ్’గా సుపరిచితులైన ప్రముఖ జర్నలిస్ట్ సీహెచ్వీఎం కృష్ణారావు ఇకలేరు. ఏడాది కాలంగా క్యాన్సర్తో పోరాడుతున్న ఆయన గురువారం కన్నుమూశారు. జర్నలిజం రంగంలో దీర్ఘకాలంపాటు అంకితభావంతో పనిచేసిన ఆయన గొప్పపేరు పొందారు. 1975లో ఒక సాధారణ స్ట్రింగర్గా కెరియర్ని ఆరంభించి అనతికాలంలో జర్నలిజం రంగంలో ఉన్నత స్థానాలకు ఎదిగారు. తన దీర్ఘకాల కెరియర్లో పలు ప్రముఖ తెలుగు, ఇంగ్లీష్ వార్తా పత్రికల్లో పనిచేశారు. ఆయనకు భార్య, ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు.
సీఎం కేసీఆర్ సంతాపం..
సీనియర్ జర్నలిస్ట్ సీహెచ్ఎంవీ కృష్ణారావు మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. అభ్యుదయ భావాలు కలిగిన కృష్ణారావు సీనియర్ జర్నలిస్టుగా చేసిన సేవలను స్మరించుకున్నారు. పలు రంగాల్లో లోతైన అవగాహనతో ప్రజా ప్రయోజనాల కోణంలో వారు చేసిన రచనలు, విశ్లేషణలు, కొనసాగించిన టీవీ చర్చలు ఆలోచన రేకెత్తించేవిగా వుండేవని సీఎం గుర్తుచేశారు. నాలుగు దశాబ్దాలకు పైబడి జర్నలిజం రంగానికి నిజాయితీగా సేవలందించిన సీనియర్ జర్నలిస్టు కృష్ణారావు మరణం పత్రికా రంగానికి తీరనిలోటని పేర్కన్నారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాడ సానుభూతిని తెలియజేశారు.