నవ తెలంగాణ – సిద్దిపేట
సీఎం కేసీఆర్ 4న ఉదయం 10 గంటలకు ఆయన సెంటిమెంట్ దేవాలయం అయిన కోనాయిపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయంలో నామినేషన్ పత్రాలకు పూజలు నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. ముందుగా ఈ నెల 9న ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని ప్రకటించినప్పటికి, శనివారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఎన్నికల నామినేషన్లు వేసే ముందు ప్రతిసారి కేసీఆర్ ఈ ఆలయంలో నామినేషన్ పత్రాలకు పూజలు చేయించడం అనవాయితీగా కొనసాగిస్తున్నారు.