నవతెలంగాణ – తిరుపతి : తిరుపతి ఆర్టీసీ సెంట్రల్ బస్టాండులో రెండేళ్ల బాలుడు కిడ్నాప్నకు గురయ్యాడు. టికెట్ కౌంటర్ వద్ద తల్లిదండ్రులతో పాటు నిద్రిస్తున్న బాలుడిని గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తకెళ్లారు. అర్థరాత్రి 2 గంటలకు ఘటన చోటు చేసుకుంది. ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు. చెన్నైకి చెందిన రెండేళ్ళ బాలుడు అరుల్ మురుగన్గా గుర్తించడం జరిగింది. బాలుడి తండి రామస్వామి చంద్రశేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.