ననవతెలంగాణ-హైదరాబాద్: చింతకొమ్మదిన్నె మండలం నాగిరెడ్డిపల్లెకు చెందిన పూసల నాగభూషణం కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తన్నాడు. ఈ తరుణంలో తోటి కూలి అయిన ఖాసీంకు నాగభూషణం రూ.200 ఇవ్వాల్సి ఉంది. గురువారం ఇద్దరు డబ్బుల విషయమై మాట్లాడుకుంటుండగా గొడవ జరిగింది. ఖాసీం డబ్బులివ్వమని ఎన్నిసార్లు అడిగిన ఇవ్వకపోడంతో కోపంతో నాగభూషణంను తోటి కూలితో కలిసి కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో నాగభూషణం తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు చికిత్స నిమిత్తం నాగభూషణంను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న నాగభూషణం శుక్రవారం రాత్రి చెందారు. మృతుని కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఖాసీం అరెస్ట్ చేశారు.