నవతెలంగాణ- భువనగిరి: భువనగిరి నియోజకవర్గం సీపీఐ(ఎం) అభ్యర్థిగా కొండమడుగు నరసింహ పేరును సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆదివారం ఉదయం ప్రకటించారు.
బయోడేటా:
కొండమడుగు నరసింహ( 48 )
గ్రామం. ముత్తిరెడ్డిగూడెం
భువనగిరి మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా.
తల్లిదండ్రులు: కొండమడుగు సాయమ్మ, బాలయ్య.
చదువు ఇంటర్ వృత్తి పూర్తి కాలం
సీపీఐ(ఎం) కార్యకర్తగా పనిచేస్తున్నారు.
రాజకీయ ప్రస్థానం..
1988లో భువనగిరి పట్టణంలోని బీచ్ మహేష్ హైస్కూల్ లో ఏడవ తరగతి ఉండగా ఎస్ఎఫ్ఐ సభ్యత్వం
1990లో ఎస్ఎఫ్ఐ హాస్టల్ కమిటీ కార్యదర్శిగా
1991 లో బీచ్ మహేష్ స్కూల్ ఎస్ఎఫ్ఐ కమిటీ కార్యదర్శిగా
1992 నుండి 94 వరకు ఎస్ఎఫ్ఐలో వివిధ కమిటీలలో పని చేశారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎస్ఎఫ్ఐ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు.
1993 నుండి 95 వరకు ఉమ్మడి నల్గొండ జిల్లా కమిటీ సభ్యునిగా పనిచేశారు.
1996లో ప్రజానాట్యమండలిలో సభ్యత్వం తీసుకొని డివిజన్ కార్యదర్శిగా,
2000 సంవత్సరం నుండి 25 వరకు ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా జిల్లా కేంద్రంలో పనిచేశారు. 2005 నుండి 16 వరకు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘంలో చేరి అధ్యక్ష కార్యదర్శులుగా పని చేశారు.
2013 నుండి 16 వరకు దళిత పోషణ్ ముక్తి మంచి జాతీయ కమిటీ సభ్యులుగా పని చేశారు.
2016 నుండి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ చేస్తున్నారు.
1992లో సీపీఐ(ఎం) సభ్యునిగా
2004లో ఉమ్మడి నల్గొండ జిల్లా సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులుగా ఎన్నికైనారు.
2017లో ఉమ్మడి నల్గొండ జిల్లా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులుగా,
2018లో రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు.
ప్రస్తుతం సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యునిగా పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యునిగా ఎన్నికైనారు. సీపీఐ(ఎం) 1996 నుండి నేటి వరకు సిపిఎం పూర్తి కాలం కార్యకర్తగా పనిచేస్తూ ఉన్నారు.