– జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి
నవతెలంగాణ-రామారెడ్డి : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని, మాజీ మంత్రి షబ్బీర్ అలీని విమర్శించే స్థాయి నీది కాదని, ఎమ్మెల్సీ కవిత సుభాష్ రెడ్డి ఎవరో అడుగుతే చెబుతుందని, కవితకు చుక్కలు చూపించిందే సుభాష్ రెడ్డి అని ఆదివారం జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మధ్యాహ్న భోజనాన్ని, నీళ్ల చారుతో కాకుండా, మెనూను పెంచి, మధ్యాహ్న భోజన కార్మికులకు బిల్లులను చెల్లించా లని, , నాణ్యమైన అల్పాహార భోజనాన్ని విద్యార్థులకు అందించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయకపోతే నీవు ఎక్కడ ఉండే వాడివో ఆలోచించుకో, తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ, సోనియాగాంధీ చొరవతో ఏర్పాటు చేసింది నీకు తెలియదా అని అన్నారు. కాంగ్రెస్ పార్టీపై, కాంగ్రెస్ నాయకులపై విమర్శించేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలని అన్నారు.
నవతెలంగాణ-రామారెడ్డి : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని, మాజీ మంత్రి షబ్బీర్ అలీని విమర్శించే స్థాయి నీది కాదని, ఎమ్మెల్సీ కవిత సుభాష్ రెడ్డి ఎవరో అడుగుతే చెబుతుందని, కవితకు చుక్కలు చూపించిందే సుభాష్ రెడ్డి అని ఆదివారం జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మధ్యాహ్న భోజనాన్ని, నీళ్ల చారుతో కాకుండా, మెనూను పెంచి, మధ్యాహ్న భోజన కార్మికులకు బిల్లులను చెల్లించా లని, , నాణ్యమైన అల్పాహార భోజనాన్ని విద్యార్థులకు అందించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయకపోతే నీవు ఎక్కడ ఉండే వాడివో ఆలోచించుకో, తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ, సోనియాగాంధీ చొరవతో ఏర్పాటు చేసింది నీకు తెలియదా అని అన్నారు. కాంగ్రెస్ పార్టీపై, కాంగ్రెస్ నాయకులపై విమర్శించేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలని అన్నారు.